రైలు కిందపడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

కర్నూలు: జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పాణ్యం మండలం కౌలూరులో రైలు కిందపడి ఓ మహిళతో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై నలుగురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

నంద్యాల  రోజా కుంట ప్రాంతానికి చెందిన గఫార్‌ మంగళవారం మధ్యాహ్నం భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో నంద్యాల నుంచి  ప్రాణ్యం మండలం కౌలూరు వద్దకు వచ్చాడు. గూడ్స్‌  రైలుకింద పడి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గఫార్‌ గతంలో ఓ బంగారం దుకాణంలో చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.  కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో రోజాకుంట ప్రాంతంలో విషాదం అలుముకుంది.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: సూప‌ర్‌ఫాస్ట్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం

Leave A Reply

Your email address will not be published.