ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతుల ఫైలుపై సిఎం సంతకం

హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఎంతో కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న పదోన్నతుల దస్త్రంపై సిఎం కెసిఆర్ సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు సమయాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పదోన్నతుల దస్త్రంపై సీఎం సంతకం చేయడంతో అర్హులైన ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా పదోన్నతులు లభించనున్నాయి.
జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరీల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఇటీవల సీఎం ఆదేశించారు.అలాగే కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీఎస్ సైతం ఈ నెల 5న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు.