ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : చిరంజీవి

హైద‌రాబాద్ (CLiC2NEWS): విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు జయంతి ఇవాళ‌. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా ప‌లువురు నివాళులు అర్పిస్తున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరారు.

“ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడి 99వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ”  అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.