ఎపిలో కొత్తగా 1288 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,288 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,04,548 కు చేరింది. వీటిలో 8,88,508 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8,815 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,225 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 610 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు బులిటెన్లో పేర్కొన్నారు.