ఎమ్మెల్సీ నియామకాలపై హైకోర్టులో రిట్ పిటిషన్
గోరేటి వెంకన్న, సారయ్య, దయానందకు హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్యా, దయానందల నియామకాలను చాలెంజ్ చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని తన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం ఎమ్మెల్సీ సిఫార్సులను ఆమోదించడంపై ఆయన హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.
తన పేరును రెండుసార్లు గవర్నర్ ప్రతిపాదించినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, సారయ్య, దయానందకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.