ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గడచిన 24 గంటల్లో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా ఒక్కరు కూడా మృతిచెందలేదు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 887466కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1358 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 878956 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7152కు చేరింది.