ఏపీలో కొత్త‌గా 179 కరోనా కేసులు

అమ‌రావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి.  గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్ విడుద‌ల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,245కి చేరింది.  ఇందులో 8,77,443 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1660 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒక్కరు మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,142కి చేరింది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 39,099 కరోనా టెస్టులు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.