చిరు, మ‌హేష్ చెరో కోటి విరాళం

హైద‌రాబాద్ః గ‌త వారం రోజుల‌న నుండి హైద‌రాబాద్ న‌గ‌రం త‌డిసి ముద్ద‌యింది. ఇప్ప‌టికి ఇంకా ప‌లు కాల‌నీలు నీటిలోనే ఉన్నాయి. ప‌లువురు ముంపు బాధితులు స‌హాయం కోసం ఎదురు చూస్తున్నారు. కెసిఆర్ స‌ర్కార్ త‌క్ష‌ణ సాయంగా రూ. 550 కోట్లు విడుద‌ల చేసింది. బాధితుల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకురావాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు స్వయంగా పిలుపునిచ్చారు. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు సంస్థ‌లు, ప్ర‌ముఖులు, సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారు ప‌లువురు ముందుకు వ‌స్తున్నారు.

 

ఈ నేప‌థ్యంలో సిఎం పిలుపు మేర‌కు టాలీవుడ్ ఇండ‌స్ట్రీనుండి ప‌లువురు స్పందించారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయ‌లు, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించారు. అలాగే యువ‌సామ్రాట్ అక్కినేని నాగార్జున రూ. 50 ల‌క్ష‌లు, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రూ. 50 ల‌క్ష‌లు, యువ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ రూ.10 ల‌క్ష‌లు, ద‌ర్శ‌కులు హ‌రీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. మరికొంత మంది సినీ ప్రముఖులు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇప్ప‌టికే తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర సీఎం కె.పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వం చేసే సహాయక చర్యలకు తోడ్పడేందుకు ఈ విరాళం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది.

 

Leave A Reply

Your email address will not be published.