చైనాలో కుప్పకూలిన రెస్టారెంటు

బీజింగ్: చైనాలో రెస్టారెంటు కుప్పకూలి 29 మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో జుక్సైన్ రెస్టారెంటు కుప్పకూలిన ఘటన విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం 9.40 నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. రెండంతస్థుల భవనం శిథిలాల కింద నుంచి 59 మంది క్షతగాత్రులను బయటకు తీశారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 21 మంది స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం ఉదయం సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఇంకా గుర్తించలేదన్నారు. కాగా ప్రమాదం జరిగిన రోజు ఆ రెస్టారెంటులో 80 ఏళ్ల వ్యక్తి బర్త్డే పార్టీ జరుపుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేడుకకు ఎక్కువమంది హాజరవడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. కాగా ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఏది ఏమైనా