తెలంగాణలో కొత్తగా 997 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో తాజాగా గడిచిన 24 గంటల్లో 997 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో క‌రోనా నుంచి మ‌రో 1222 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్న‌వారి సంఖ్య 2,37,172కు చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 2,55,663 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 17,094 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 14,466 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. నిన్న రాత్రివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల‌ న‌లుగురు మ‌ర‌ణించారు. దీంతో క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 1,397 మంది బాధితులు మృతిచెందారు.

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసులు

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 169, ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 65, జగిత్యాల్‌ 23, జనగాం 11, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులమ్మ గద్వాల్‌ 10, కామారెడ్డి 22, కరీంనగర్‌ 49, ఖమ్మం 44, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 0, మహబూబ్‌ నగర్‌ 18, మహబూబాబాద్‌ 20, మంచిర్యాల్‌ 19, మెదక్‌ 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి 85, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 25, నల్గొండ 46, నారాయణ్‌పేట్‌ 6, నిర్మల్‌ 13, నిజామాబాద్‌ 22, పెద్దంపల్లి 21, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 66, సంగారెడ్డి 24, సిద్ధిపేట్‌ 18, సూర్యాపేట 30, వికారాబాద్‌ 12, వనపర్తి 10, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 44, యాద్రాది భువనగిరి 18 కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.