తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 253 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 317 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇక, మరో ముగ్గురు కరోనాతో మృతిచెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993కు చేరుకున్నారు. కాగా ఇప్పటి వరకు 2,81,400 మంది రికవరీ అయ్యారు. మృతుల సంఖ్య 1554కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,039 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 2,793 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. కోవిడ్ బులెటిన్ ప్రకారం 42,485 శాంపిల్స్ పరీక్షించారు.. తాజా కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.