తెలంగాణలో కొత్తగా 612 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 56,178 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 612 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,76,516కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,485కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 502 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,67,427కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,604 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో 5,511 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.