తెలంగాణలో `టెన్త్` పరీక్షా పేపర్లు తగ్గిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. 11 పరీక్షలకు బదులుగా 6 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసంది. ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అకాడమిక్ ఇయర్ 2020-2021కు గాను మొత్తం 11 పరీక్షా పేపర్లను కుదిస్తూ 6 పేపర్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో డైరక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ప్రతిపాదనలను అనుసరించి ఈ ఆదేశాలు జారీచేశారు.ఈ నూతన విధానంలో ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మాథమెటిక్స్, జనరల్ సైన్స్(ఫిజిక్స్&బయాలజీ), సోషల్ స్టడీస్కు చెందిన పేపర్ -1, పేపర్-2లు ఒకే పరీక్షా పేపర్గా ఉండనున్నాయి. కాగా సెకండ్ లాంగ్వేజ్లో ఏ విధమైన మార్పు లేదు. ఈ ఆరు పేపర్ల విధానం ఈ విద్యా సంవత్సరానికి(2020-2021) మాత్రమేనని ప్రభుత్వం ఉత్వర్వులో పేర్కొంది.