తెలంగాణ కొత్తగా 205 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతిచెందగా, 551 మంది రికవరీ అయ్యారు. పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,068కు చేరుకోగా, కోలుకున్నవారి సంఖ్య 2,77,304కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్తో 1533 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని.. రివకరీ రేటు దస్త్రశంలో 95.8 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 97.27 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.