దేశంలో కొత్తగా 28,903 పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో రోజువారీ కేసులు త‌గ్గుతూ వ‌చ్చినా మ‌ళ్లీ క‌రోనా పంజా విసురుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 28,903 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా నమోదైన కేసులతో క‌లిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది. కొత్తగా 17,741 మంది కోలుకున్నారు. కాగా ఇప్పటి వరకు 1,10,45,284 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో 24 గంటల్లో కొత్త‌గా 188 మంది మృత్యువాతపడ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతిచెందిన వారి సంఖ్య 1,59,044కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 2,34,406 ఉన్నాయని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.