నితీశే బీహార్ సిఎం: ‌ప్ర‌ధాని మోడీ

ప‌ట్నా: ‌బీహార్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఎన్‌డిఎ కూట‌మి అధిక సీట్లు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. అయితే బీహార్ సిఎం పీటం నితీష్‌దా? బిజెపి అభ్య‌ర్థేనే వ‌రిస్తుందా? అనే ప్ర‌శ్న అంద‌రిలో త‌లెత్తింది. అయితే ఈ అనుమానాల‌న్నింటికి ప్ర‌ధాని మోడీ పుల్‌స్టాప్ పెట్టారు. త‌దుప‌రి ముఖ్య‌మంత్రి నితీశ్ కుమారే అని బీజేపీ ప్ర‌క‌టించింది. అందులో ఎలాంటి సందేహం లేద‌ని ఆ పార్టీ నేత‌, రాష్ట్ర‌ ఉప‌ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ మోడీ స్ప‌ష్టం చేశారు. తాము ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని, ఇందులో ఎలాంటి గంద‌ర‌గోళం లేద‌ని.. నితీశే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతార‌ని చెప్పారు. ఎన్నిక‌ల్లో కొంద‌రు ఎక్కువ సీట్లు గెలుస్తారు, మ‌రికొంద‌రు తక్కువ స్థానాల్లో విజ‌యం సాధిస్తారు. కానీ తామంతా స‌మాన భాగ‌స్వాముల‌మ‌ని వెల్ల‌డించారు. మూడు విడుత‌ల్లో జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీయే కూట‌మిలో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. కూట‌మిలో ఉన్న సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ 43 స్థానాలతో స‌రిపెట్టుకుంది‌. దీంతో నితీశ్ సీఎం ప‌ద‌వీ గండం ఏర్ప‌డిందని, రాష్ట్రంలో మొద‌టిసారిగా బీజేపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈనేప‌థ్యంలో సీఎం ప‌దవిపై సుశీల్ కుమార్ మోడీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతో బీహార్ ఉత్కంఠ‌కు ప్ర‌ధాని తెర‌దించారు.

Leave A Reply

Your email address will not be published.