ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జెండా ఆవిష్క‌రించిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వేడుకలు నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జెండాను ఎగుర‌వేసి వంద‌నం చేశారు. అంత‌కుముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద సిఎం కెసిఆర్‌ నివాళులర్పించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, మేయర్‌ విజయలక్ష్మి అమరవీరులకు నివాళులర్పించారు. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆవిర్భావ వేడుక‌లు నిరాడంబ‌రంగా జ‌రుగుతున్నాయి.

వేడుక‌ల్లో పాల్గొన్న హ‌రీష్‌రావు, కెటిఆర్‌..
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆవిర్భావ వేడుక‌ల్లో పాల్గొన్నారు. సిద్దిపేట‌లో హ‌రీష్‌రావు, సిరిసిల్ల‌లో మంత్రి కెటిఆర్ జాతీయ జెండాను ఎగుర వేశారు.

1 Comment
  1. Mallesh+Yengani says

    అన్నీ ప్రగతి భవన్ నుండి అయితే ఇంకా సెక్రెటరెట్ ఎందుకో….

Leave A Reply

Your email address will not be published.