`బెంగాల్`లో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

కోల్కతా : పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బండరాళ్ల లోడ్తో వెళ్తున్న ట్రక్కు ఓ కారుతో పాటు ఆటోపై బోల్తా పడిన ఘటనలో వీరంతా మృతి చెందారు. ఈ ఘటన జల్పాయిగుడి జిల్లా ధుప్గుడి వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని స్థానిక ఎమ్మెల్యే మిథాలీ రాయ్ తెలిపారు. ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జల్పాయిగుడిలోని హాస్పిటల్కు తరలించారని వారు తెలిపారు.
కాగా ఆ పరిసర ప్రాంతంలో పొగమంచు కారణంగా ట్రక్కు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై బోల్తాపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బండరాళ్లు వాహనాలపై పడడంతో భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు, ఇతర సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
West Bengal: 13 people died in an accident in Dhupguri city of Jalpaiguri district last night, due to reduced visibility caused due to fog. The injured were taken to a hospital. pic.twitter.com/HHUvqCist6
— ANI (@ANI) January 20, 2021