మే నెల‌లో `యాదాద్రి` పునఃప్రారంభం?: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్: యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో రానున్న మే నెల‌లో ఆల‌యాన్ని పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం ముఖ్య‌మంత్రి పరిశీలించారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా ప‌రిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గురువారం మ‌ధ్యాహ్నం యాదాద్రి చేరుకున్న సీఎం తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రిలో ఇంకా అసంపూర్తిగా ఏ పనులు ఉన్నాయి?.. అవి ఎప్ప‌డు పూర్తవుతాయనే విషయాలపై సిఎం దృష్టి సారించారు. ప్రధాన ఆలయ ప్రాగణంలో కలియదిరిగిన ముఖ్య‌మంత్రి మాడ వీధులు, క్యూ లైన్ దారి, ప్రాకార మండపాలు త‌దిత‌ర నిర్మాణాల‌ను పరిశీలించారు. ప‌లు సూచ‌న‌లు కూడా చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.