మహారాష్ట్రలో కొత్తగా 2,630 కరోనా కేసులు.. 42 మరణాలు
ముంబయి: మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,630 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్గా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ 42 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,23,814కు, మరణాల సంఖ్య 51,042కు చేరింది. అలాగే గత 24 గంటల్లో 1,535 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,27,335కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,199 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.