రాజశేఖర్, జీవితలకు కరోనా..!

హైదరాబాద్ : కరోనా మహమ్మారి దేశంలోని రాజకీయనాయకులు, ప్రముఖులతో పాటు టాలీవుడ్ను వదలడం లేదు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు నాగబాబు, సంగీత దర్శకుడు కీరవాణి, నటి తమన్నా కోవిడ్-19 బారిన పడి కోలుకున్న సంగతి విదితమే. తాజాగా ప్రముఖ టాలీవుడ్ జంట రాజశేఖర్, జీవిత కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితమే కరోనా సోకగా..ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. జీవిత క్వారెంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం రాజశేఖర్..ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అంతలో ఆయనకు కరోనా సోకింది.