రామ్ చరణ్కి కరోనా పాజిటివ్

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘నేను కరోనా బారినపడ్డా.. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. అయితే నాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలిజయజేస్తాను’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
ఇక నాలుగు రోజుల క్రితం చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్ జరుపుకున్నారు. వీరంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి. అంతేకాక రెండు రోజుల క్రితం చరణ్ ఆచార్య సెట్కి వెళ్లారు. డైరెక్టర్ కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్ను కలిశారు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరిని పలకరించారు. ఇక ప్రస్తుతం చరణ్కి కోవిడ్ పాజిటివ్గా తేలడంతో వీరందరిలో టెన్షన్ మొదలైంది.
Request all that have been around me in the past couple of days to get tested.
More updates on my recovery soon. pic.twitter.com/lkZ86Z8lTF— Ram Charan (@AlwaysRamCharan) December 29, 2020