గుజరాత్లోని తీగల వంతెన ఘటన.. 132కి చేరిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్ (CLiC2NEWS): గుజరాత్లోని మోర్బీ పట్టణంలోని మచ్చు నదిపై తీగల వంతెన ఆదివారం కూలిన విషయం తెలిసినదే. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 132కి చేరింది. తీగల వంతెన సామర్థ్యానికి మించి సందర్శకులు ఎక్కువవడంతో వంతెన కూలిపోయింది. పైగా కొందరి ఆకతాయి చేష్టలు ఈ ఘటనకు కారణమయ్యాయని తెలుస్తోంది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఇప్పటి వరకు 177 మందిని రక్షించారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దర్ఘటనలో బిజెపి ఎంపి సోదరి కుటుంబ సభ్యులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంనాటి ఈ తీగల వంతెనకు సుమారు 7 నెలల పాటు మర్మమతులు నిర్వహించి.. తిరిగి ఈ నెల 26వ తేదీన ప్రారంభించారు. ఆదివారం సెలవుదినం కావడంతో సందర్శకుల రద్దీ ఎక్కువై వంతెనపైకి వందల మంది చేరడంతో వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈప్రమాదానికి సంబంధించిన సిసిటివి పుటేజీలు వెలుగులోకి వచ్చాయి.
CCTV footage of #MorbiBridge pic.twitter.com/yYnwtHdBqu
— Bhavesh Lodha (@bhav2406) October 31, 2022