రానున్న పదేళ్లలో 16 లక్షల ఉద్యోగాలు: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): రానున్న పదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ అప్లయేన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డిలతో కలసి కెటిఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ సంస్థలన్నీ తెలంగాణలో తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణను వ్యాపారానికి అనుకూలంగా మలిచేందుకు సిఎం కెసిఆర్ కెన్నోచర్యలు చేపట్టారు. శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుంచి సహకారం కారణంగానే చాలా కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
ఎల్ ఈడి టీవిలను రేడియంట్ సంస్త తయారు చేస్తుంది. ఇక్కడ నుండే 50లక్షల టీఈలు తయారు కావడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ సంస్థలో 3800 మంది పనిచేస్తున్నారని, అందులో 50 శాతం మహిళలు, స్థానికులు ఉండటం సంతోషాన్నిస్తుందని కెటిఆర్ అన్నారు.