దేశంలో కొత్త‌గా 16,678 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోన విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 16,678 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం కేసులు 4,36,329కి చేరాయి. వీటిలో 4,29,83,162 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వధిలో దేశంలో 26 మంది క‌రోనా బాధితులు మృత్యువాత ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 5,25,428 మంది క‌ర‌నాతో మృతి చెందారు. దేశంలో ప్ర‌స్తుతం 1,30,713 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.