బిజాపూర్‌లో 25మంది న‌క్స‌లైట్లు లొంగుబాటు..

బిజాపూర్ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో 25 మంది న‌క్స‌లైట్లు లొంగిపాయారు. వీరిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా (మావోయిస్టు)కు చెందిన వీరు గంగ్లూర్‌, బైరామ్‌గ‌ఢ్ ఏరియా క‌మిటీల్లో క్రియాశీల‌కంగా ప‌నిచేసేవారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన న‌క్స‌లైట్ల‌లో ఐదుగురి త‌ల‌ల‌పై మొత్తంగా రూ.28 ల‌క్ష‌ల రివార్డు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. శంబ‌టి మ‌ద్కం, జ్యోతి పునెం, మ‌హేశ్ తేలం.. ఒక్కొక్క‌రి త‌ల‌ల‌పై రూ.8 ల‌క్ష‌ల చొప్పున రివార్డు ఉంద‌ని తెలిపారు. శంబ‌టి అనే మ‌హిళ 2012 నుండి ఉద్య‌మంలో చురుగ్గా ఉండేవార‌ని, 2020 లో సుక్మా జిల్లాలో , 2021 లో బిజాపూర్ లో భ‌ద్ర‌తా సిబ్బందిపై జ‌రిగిన భారీ దాడుల ఘ‌ట‌న‌ల్లో ఆమె పాత్ర ఉంద‌ని వెల్ల‌డించారు. లొంగిపోయిన మావొయిస్టుల‌కు రూ.25వేలు చొప్పున సాయంతో పాటు ప్ర‌భుత్వ పాల‌సి ప్ర‌కారం పున‌రావాసాన్ని క‌ల్పిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.