మంగోలిలోని కెన‌రా బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ..

Canara bank: క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర జిల్లాలోని  కెన‌రా బ్యాంకులో భారీ చోరీ జ‌రిగింది. విజ‌య‌పుర జిల్లా మంగోలిలో ఉన్న బ్రాంచి 59 కిలోల బంగారం దుండ‌గులు ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న వారం రోజుల క్రితం జ‌ర‌గ‌గా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌జ‌లు బ్యాంకు రుణాల కోసం తాక‌ట్లు పెట్టిన బంగారం చోరీకి గురైంద‌ని పోలీసులు మీడియాకు వివ‌రించారు.

గ‌త నెల 23వ తేదీన బ్యాంకు సిబ్బంది బ్యాంకుకు తాళం వేసి వెళ్లారు.అయితే మ‌రుస‌టి రోజు.. మే 24, 25 తేదీల్లో శ‌నివారం , ఆదివారం సెల‌వు దినాలు కావ‌డంతో బ్యాంకు మూసే ఉంది. మే 26వ తేదీ ఉద‌యం బ్యాంక్ వ‌ద్ద‌కు వ‌చ్చిన క్లీనింగ్  సిబ్బందికి ష‌ట్ట‌ర్ తాళం క‌ట్ చేసిన‌ట్లు ఉండ‌టం చూసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని పోలీసులు  ప‌రిశీలించారు. చోరీ మే 24 , 25 తేదీల్లో రాత్రి జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. బ్యాంకులో మొత్తం 59 కిలోల బంగారం చోరీకి గురైన‌ట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసు ద‌ర్యాప్తు కోసం ఎనిమిది బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.