’69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్’ అందుకున్న‌ ఉత్త‌మ చిత్రం ‘బ‌లగం’..

హైద‌రాబాద్ (CLiC2NEWS): బ‌ల‌గం చిత్రం ఉత్త‌మ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ద‌క్కించుకుంది. 2024 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక‌ను న‌గ‌రంలో నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన నటీన‌టులు హాజ‌ర‌య్యారు. ఈ అవార్డుల‌ల వేడుక‌లో ఉత్త‌మ చిత్రంగా బ‌ల‌గం నిలిచింది. ఉత్త‌మ ద‌ర్శ‌కుడుగా వేణు అవార్డు అందుకున్నాడు. ఉత్త‌మ న‌టుడుగా నాని, ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్ .. ద‌స‌రా చిత్రంలోని న‌ట‌న‌కు గాను అవార్డులు ద‌క్కించుకున్నారు. ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుడి అవార్డును శ్రీ‌కాంత్ ఓదెల (ద‌స‌రా), శౌర్యువ్ (హాయ్ నాన్న‌) అందుకున్నారు. ఈ రెండు చిత్రాల‌లో నాని హీరోగా న‌టించ‌డం విశేషం. క్రిటిక్స్ విభాగంలో బేబి చిత్రం అవార్డులు అందుకుంది.

ఉత్త‌మ చిత్రం (క్రిటిక్స్‌)లో బేబీ చిత్రానికి గాను సాయి రాజేష్ ..,  ఉత్త‌మ న‌టిగా బేబి చిత్రంలోని న‌ట‌న‌కు వైష్ణ‌వి చైత‌న్య అవార్డు అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.