71కి చేరిన కొత్త కరోనా కేసులు
న్యూఢిల్లీ: న్యూ స్ట్రెయిన్ ప్రభావం భారత్లో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివరకు మొత్తం 71 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. బుధవారం కొత్తగా మరో 13 మందిలో యూకే స్ట్రెయిన్ బయటపడిందని పేర్కొన్నది. భారత్తోపాటు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాల్లో కూడా న్యూ స్ట్రెయిన్ విజృంభణ మొదలైంది.