8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘ‌న విజ‌యం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది. బాక్సిండ‌బ్ డే టెస్టులో భార‌త్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ కొద్దిగా ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ, శుభ్‌మ‌న్ గిల్‌, ర‌హానే, జ‌డేజాల అద్భుత పోరాట ప‌టిమ‌తో తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స‌రిగ్గా 200 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 కాసేపు ప్రతిఘ‌టించ‌డంతో భార‌త్ విజయం కాస్త లేట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు, ఉమేష్ ఒక వికెట్‌ తమ ఖాతాల్లో వేసుకున్నారు.

70 ప‌రుగుల ల‌క్ష్యంతో లంచ్‌ విరామం అనంతరం బ్యాటింగ్ చేప‌ట్టిన టీ మిండియా ఆదిలో రెండు వికెట్లు వెంట వెంట‌నే కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగ‌ర్వాల్ (5) ప‌రుగుల‌కు ఔట్ కాగా, పుజారా(3) ప‌రుగుల‌కు పెవీలియ‌న్ బాట ప‌ట్టారు. తొలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్(35) , స్టాండిన్ కెప్టెన్ ర‌హానే(24)తో క‌లిసి భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. దీంతో సిరీస్ 1-1తో స‌మం అయింది. ఈ సిరీస్‌లో మరో టెస్ట్‌లు మిగిలి ఉండ‌గా, ఎవ‌రు ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.