దేశంలో కొత్తగా 8954 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8954 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది.
ఇప్పటి వరకు కరోనా నుంచి 3,40,28,506 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 99,023 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఇప్పటి వరకు దేశంలో 4,69,247 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గత 24 గంటల్లో కొత్తగా 267 మంది మృతిచెందారు.