దేవాల‌యం గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి

భోపాల్ (CLiC2NEWS): మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని షాపూర్‌లో హ‌ర్దౌల్ బాబా గుడి గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంత మంది చిన్నారులు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన చిన్నారుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లంచారు. గుడి వ‌ద్ద జ‌రుగుతున్న ఓ కార్య‌క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

మ‌రోవైపు రెవా జిల్లాలో ఓ ఇంటి గోడ కూలి న‌లుగురు చిన్నారులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. వీరంతా 5 నుండి 7 ఏళ్ల లోపు వారున్న‌ట్లు తెలుస్తోంది. స్కూల్ నుండి ఇంటికి వెళ్లే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.