దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేకు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది.
ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,40,45,666 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 99,976 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
అలాగే ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మొత్తం 4,70,115 మంది మృతిచెందారు.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 391 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.
కొత్తగా 8612 మంది కరోనాన నుంచి కోలకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.