ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు.. వెన్నెలకంటి మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్. గోపాల్రెడ్డి తీసిన మురళీ కృష్ణుడు(1988) మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఆయన రాసిన అన్నీ పాటలు సూపర్ హిట్ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. పలు డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్గా పనిచేసిన వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.