మాజీ ఎంపి సబ్బంహరి కన్నుమూత

విశాఖ‌ (CLiC2NEWS): క‌రోనా మ‌హ‌మ్మారి భారిన‌ప‌డి మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు క‌న్నుమూశారు. మాజీ ఎంపి స‌బ్బంహ‌రి (69) విశాఖ‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు. మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. జూన్ 1, 1952 లో త‌గ‌ర‌పువ‌ల‌స మీపంలోని చిట్టి వ‌ల‌ల‌స‌లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్ గా ఎంపికయ్యారు. అన‌కాప‌ల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌కు కుమారుడు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.