గ్రేట‌ర్ వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మేయ‌ర్లు ఖ‌రారు

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. మేయ‌ర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయ‌ర్‌గా రిజ్వానా ష‌మీమ్ పేర్ల‌ను మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసి ప్ర‌క‌టించారు. మ‌రికాసేప‌ట్లో వీరిద్ద‌రూ ప్ర‌మాణం చేయ‌నున్నారు.

వ‌రంగ‌ల్ మేయ‌ర్‌ గుండు సుధారాణి, డిప్యూటీ మేయ‌ర్‌ రిజ్వానా ష‌మీమ్

గుండు సుధారాణి 29వ డివిజ‌న్ నుంచి గెలుపొంద‌గా, రిజ్వానా ష‌మీమ్ 36వ డివిజ‌న్ నుంచి గెలుపొందారు.
గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 66 డివిజ‌న్లు ఉండ‌గా, టీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇత‌రులు 4 స్థానాల్లో గెలుపొందారు.

ఖ‌మ్మం మేయ‌ర్ గా పునుకొల్లు నీర‌జ‌
ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. మేయ‌ర్‌గా పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌గా ఫాతిమా జోహ్రో పేర్ల‌ను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు వీరిద్ద‌రి పేర్ల‌ను ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. పునుకొల్లు నీర‌జ 26వ డివిజ‌న్ నుంచి గెలుపొంద‌గా, ఫాతిమా జోహ్రా 37వ డివిజ‌న్ నుంచి గెలుపొందారు.

ఖ‌మ్మం మేయ‌ర్‌ పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌ ఫాతిమా జోహ్రో

ఖ‌మ్మం మున్పిపల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 60 స్థానాల‌కు టీఆర్ఎస్ 45 డివిజ‌న్ల‌లో, కాంగ్రెస్ 10, ఇత‌రులు 5 డివిజ‌న్ల‌లో గెలుపొంద‌గా, బీజేపీ ఒక డివిజ‌న్‌లో మాత్ర‌మే గెలిచింది.

Leave A Reply

Your email address will not be published.