India Corona: కొత్తగా 28,326 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కొత్తగా 28,326 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ ఆదివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో న‌మోదైన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది.
  • ప్ర‌స్తుతం 3,03,476 మంది చికిత్స పొందుతున్నారు.
  • గత 24 గంటల వ్య‌వ‌ధిలో దేశంలో 26,032 మంది కొత్తగా వైరస్‌ నుంచి కోలుకున్నారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,29,02,351 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
  • గత 24 గంటల వ్య‌వ‌ధిలో దేశంలో 260 మంది మరణించారని తెలిపింది.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 4,46,918 మంది కరోనా వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 85,60,81,527 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య‌శాఖ‌ తెలిపింది.
Leave A Reply

Your email address will not be published.