Good News: దిగివ‌స్తున్న ‌వంట నూనెల ధ‌ర‌లు

కిలో రూ.20 వ‌ర‌కు తగ్గింపు

న్యూఢిల్లీ (CliC2NEWS): వంట నూనె ధ‌ర‌లు కిలోకు రూ. 7 నుంచి రూ.20వ‌ర‌కు త‌గ్గిన‌ట్టు కేంద్ర ఆహార ప్ర‌జాపంపిణి విభాగం తెలిపింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వంట నూనె ధ‌ర‌లు సామాన్యుడికి చుక్క‌లు చూపించాయి. కిలో నూకె ధ‌ర రూ. 190-120 వ‌ర‌కు ఉండేది. ఈ ఏడాది క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తూ ప్ర‌స్తుతం రూ. 150-160 వ‌ర‌కు ఉంది. ఇపుడు తాజాగా మ‌రికాస్త త‌గ్గే అవ‌కాశం ఉంది. పామాయిల్‌, ప‌ల్లి నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్ర‌ధాన‌మైన నూనె ర‌కాల‌పై ధ‌ర‌లు త‌గ్గిన‌ట్లు పుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రి బ్యూష‌న్ డిపార్టుమెంట్ కార్య‌ద‌ర్శి తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.