TS: ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు స‌ర్కార్ ఆమోదం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. భార్యాభ‌ర్త‌ల‌ను ఒకే చోటుకుడ‌దిలీచేసేందుకు వ‌చ్చిన విన‌తులు, అప్పీళ్ల ప‌రిష్కారం పూర్తికావ‌డంతో ప‌ర‌స్ప‌ర బ‌దిలీలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల కోసం వ‌చ్చేనెల 1వ తేదీ నుండి 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకొనేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.