యాద‌గిరిగుట్ట‌లో కుప్ప‌కూలిన భ‌వ‌నం… న‌లుగురి మృతి

యాద‌గ‌రిగుట్ట (CLiC2NEWS): యాదాద్రి జిల్లా లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. యాదగిరి గుట్ట‌లో రెండంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. మెయిన్‌రోడ్డుకు ప‌క్కనే ఉన్న శ్రీ‌రాంన‌గ‌ర్‌లో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు మృతి చెందారు. శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. భ‌వ‌నం ముందు భాగంలో రెండు దుకాణాలు ఉండ‌గా. వెనుక భాగంలో రెండు కుటుంబాలునివ‌శిస్తున్నాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌యి. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.