ఆన్లైన్లో ఇంటర్ హాల్టికెట్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీనుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాలేజీల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఈరోజు సాయంత్రం నుండి వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రైవేటు కళాశాలల వారు కొందరు విద్యార్థులను ఫీజు చెల్లిస్తేనే హాల్టికెట్లు ఇస్తామని అంటున్నారని ఫిర్యాదులు వస్తున్నతరుణంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కళాశాలలకు వెళ్లాల్సిన పనిలేకుండా ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు.