గ్యాస్ సిలిండ‌ర్ పేలి న‌లుగురు మృతి

శెట్టూరు (CLiC2NEWS): అనంత‌పురం జిల్లాలో సిలిండ‌ర్ పేలి ప్ర‌మాదం జ‌రిగింది. శెట్టూరు ముల‌క‌లేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. ఈ ప్ర‌మాదంలో  ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప‌క్క‌న ఉన్న ఇంటి పైకప్పు కూలిపోయి ఆ ఇంట్లో ఉన్న న‌లుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిని దాదు, ష‌ర్ఫునా, ఫిర్దోజ్‌, జైనుబిగా గుర్తించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. పైకప్పు శిథిలాల కింద ఉన్న మృత దేహాల‌ను వెలికి తీశారు. ఈ ప్ర‌మాదంతో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.