18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ప్రికాషన్ డోస్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో శుక్రవారం నుండి 18-59 ఏళ్ల వారికి ఉచితంగా టీకా పంపిణీ చేపట్టింది. ఇప్పటివరకు హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉచితంగా ప్రభుత్వం ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తోంది. శుక్రవారం నుండి సెప్టెంబర్ నిలాఖరు వరకూ వైద్యశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. 18 నుండి 59 వయసు వారందరికీ కూడా ప్రికాషన్ డోస్ పొందేందుకు అవకాశం కల్పించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 రోజుల పాటు డ్రైవ్ నిర్వహిస్తారు.