హెచ్‌సిఎ నిర్వ‌హ‌ణ కోసం ప్యానెల్‌ను నియమించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహణ కోసం దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కోర్టు ఏర్పాటుచేసిన కమిటీలో జస్టిస్‌ ఎన్‌ఎ కక్రు (ఎపి హైకోర్టు రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌), తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అంజనీకుమార్‌, వెంకటపతి రాజు, వంక ప్రతాప్‌లు సభ్యులుగా ఉంటారు.

చీఫ్ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచార‌ణ జ‌రిపింది. హెచ్‌సిఎ రోజువారీ వ్యవహారాలను నిర్వహణ కోసం ప్యానెల్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న‌ట్లు కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

ఈ సంద‌ర్భంగా కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.. “అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకానికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)లోని ప‌లువురు ఆఫీస్ బేరర్ల మధ్య వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే.. హెచ్‌సిఎం నిర్వహణను పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు భావిస్తోంది.“ అని అత్యున్న‌త ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.

“ప్రతాప్, హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ కూడా, కమిటీ సమర్థవంతమైన పనితీరును నిర్వ‌హించ‌డానికి కమిటీలోని ఇతర సభ్యులకు అవసరమైన అన్ని సహాయాన్ని అందించాలని“ కోర్టు ఉత్త‌ర్వుల‌లోఆదేశించింది.

“అపెక్స్ కౌన్సిల్, జనరల్ బాడీ తీసుకున్న అన్ని నిర్ణయాల ధృవీకరణ కోసం సూపర్‌వైజరీ కమిటీ ముందు ఉంచాలి… నవంబర్ 2019 నుండి అపెక్స్ కౌన్సిల్, జనరల్ బాడీ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలతో సహా ఏదైనా నిర్ణయం కూడా అసోసియేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తగిన చర్య కోసం సూపర్‌వైజరీ కమిటీ ముందు ఉంచబడుతుంది.“అని కోర్టు ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది.

“అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్ ఆఫీసర్ నియామకానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సూపర్‌వైజరీ కమిటీ పరిశీలిస్తుంది.. ఏదైనా తీవ్రమైన అవకతవకలను ఈ కోర్టు దృష్టికి తీసుకురావాలని కమిటీకి సూచిస్తున్నాం“ కోర్టు ఆర్డ‌ర్‌లో పేర్కొంది.

Loading...
Leave A Reply

Your email address will not be published.