చైనాలో కొవిడ్ ఉధృతి.. కిక్కిరిసిపోతున్న ఆస్ప‌త్రులు

బీజింగ్‌ (CLiC2NEWS): చైనాలో కారోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. రాజ‌ధాని బీజింగ్‌తో పాటు ప‌లుచోట్ల ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో కిక్కిరిసిపోతున్నాయి. చైనాలో ప‌దిహేను రోజుల క్రితం కొవిడ్ క‌ఠిన నిబంధ‌న‌లు స‌డ‌లించారు. దీంతో ఒక్క‌సారిగా మ‌హ‌మ్మారి తీవ్ర‌త పెరిగిపోతుంది. కొన్ని ఆస్ప‌త్రుల‌లో గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించ‌వ‌ల‌సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. వాటి దృశ్యాలు సామాజిక మాద్య‌మాల‌లో ప్ర‌సారం అవుతున్నాయి. క‌రోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని.. ఇది డెల్టా వైర‌స్ అంత ప్ర‌మాద‌క‌మైన‌ది కాద‌ని నిపుణులు చెబుతున్నారు.

1 Comment
  1. zoritoler imol says

    It’s actually a cool and helpful piece of info. I’m satisfied that you just shared this helpful info with us. Please keep us up to date like this. Thanks for sharing.

Leave A Reply

Your email address will not be published.