పిఠాపురంలో పవన్ ఘన విజయం

ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత, పిఠాపురం అభ్యర్థి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన్ను స్థానిక ప్రజలు గెలిపించారు. తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించారు.