తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం.. సిట్ చీఫ్‌గా స‌ర్వ‌శ్రేష్ట త్రిపాఠి

అమ‌రావ‌తి (CLiC2NEWS): తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా అల‌జ‌డిని సృష్టించింది. దీనిపై ఎపి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యిపై విచార‌ణ జ‌రిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజి స‌ర్వ‌శ్రేష్ట త్రిపాఠిని నియ‌మించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డిఐజి గోపినాథ్ జెట్టి, క‌డ‌ప ఎస్‌పి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాజుతోపాటు మ‌రికొంద‌రు డిఎస్‌పిలు, సిఐలు , ఎస్ ఐలు ఉన్న‌ట్లు స‌మాచారం.

 

Leave A Reply

Your email address will not be published.