బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ

ఢాకా (CLiC2NEWS): బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వ‌హించారు. మైనార్టి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం వేలాదిమంది త‌ర‌లిరావ‌డంతో వీధుల‌న్నీ జ‌న‌సంద్రాన్ని త‌ల‌పిస్తోంది. ఆ దేశంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న తాత్కాలిక ప్ర‌భుత్వం ముందు ప‌లు డిమాండ్లు ఉంచారు. వాటిని నెర‌వేర్చేదాకా వీధుల్లో త‌మ నిర‌స‌న కొన‌సాగుతుంద‌ని కొంద‌రు హిందూ ఉద్య‌మ‌కారులు పేర్కొన్నారు. ఈ మేర‌కు మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి.
బంగ్ల‌దేశ్‌లో రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా కొన్ని నెల‌ల క్రితం హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. షేక్ హ‌సీనా ప్ర‌భుత్వం అధికారాన్ని కోల్పోయి.. హ‌సీనా రాజీనామా చేసి భార‌త్‌ను ఆశ్ర‌యించారు. ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు యూన‌స్ నేతృత్వంలోని తాత్కాలిక ప్ర‌భుత్వ‌పాల‌న కొన‌సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.