బ్రెజిల్లో ఘోర ప్రమాదం.. 62 మంది మృతి
బ్రెజిల్ (CLiC2NEWS): బ్రెజిల్ లో విమానం కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. సావోపువాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు , సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రమాదం జరిగిన చోటు నుండి భారీ ఎత్తులో దట్టంగా పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై దేశాధ్యక్షుడు లుయూజ్ లులా కసిల్వా ఆరా తీసినట్లు సమాచారం.