అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ యువ‌తి మృతి

యాద‌గిరిగుట్ట (CLiC2NEWS): అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంల తెలంగాణకు చెందిన యువ‌తి ప్రాణాలు కోల్పోయారు. యాద‌గిరిగుట్ట శివారులోని యాద‌గిరిప‌ల్లెకు చెందిన గుంటిప‌ల్లి సౌమ్య ఉన్న‌త చ‌దువుల‌కోసం అమెరికా వెళ్లిన‌ట్లు స‌మాచారం. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం అర్ద‌రాత్రి జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆమె మృతి చెందింది. సౌమ్య రోడ్డుపై న‌డుచుకుంటూ వెళుతున్న‌పుడు కారు ఢీకొట్ట‌డ్డంతో ఆమె అక్క‌డిక‌క్కడే మృతిచెందింది. సౌమ్య మృతితో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. సౌమ్య చ‌దువుతోపాటు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఉన్న‌త చ‌దువుల‌కై వెళ్లిన త‌మ బిడ్డ రోడ్డు ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణించ‌డంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.